పేరు మార్చిన లక్ కలిసొచ్చేనా…!

ప్రస్తుతం తేజూ ఆశలన్నీ ‘చిత్రలహరి’పైనే ఉన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టుకొట్టి మళ్లీ ట్రాక్లోకి రావాలని చూస్తున్నారు. అందుకే తన పేరును కూడా మార్చుకున్నారు తేజూ. ‘చిత్రలహరి’ టైటిల్స్లో తన పేరును సాయిధరమ్ తేజ్ అని కాకుండా ‘సాయి తేజ్’ అని రాసుకున్నారు. తాజాగా విడుదలైన ‘పరుగు పరుగు’ లిరిక్ వీడియో టైటిల్స్లో తేజూ పేరు సాయి తేజ్ అని వచ్చింది. అంటే, ఇంతకాలం తనకు పెద్దగా కలిసిరాని స్క్రీన్ నేమ్ను తేజూ మార్చేశారన్న మాట. మరి ఈ కొత్త పేరైనా సాయి తేజ్కు కలిసొస్తుందేమో చూడాలి.
‘నేను శైలజ’ వంటి యూత్ఫుల్ లవ్స్టోరీని అందించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం.. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. వీటన్నిటికీ తోడు ఈ చిత్రంలో సాయి తేజ్ లుక్ చాలా కొత్తగా ఉంది. టీజర్లో తేజూని చూసిన అభిమానులు తమ హీరో యాటిట్యూడ్ చాలా కొత్తగా ఉందని మురిసిపోయారు. రామ్కు ‘నేను శైలజ’తో కొత్త ఇమేజ్ను తీసుకొచ్చిన కిషోర్.. ఈ చిత్రంతో తేజూని హిట్ ట్రాక్ ఎక్కిస్తారని ఆశిద్దాం.